జీహెచ్ఎంసీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ మంగళవారం మధ్యాహ్నం విడుదలయ్యింది. రేపట్నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలుకానుంది. గ్రేటర్ లో మొత్తం వోటర్లు 74 లక్షల 4 వేల 286 ఉండగా.. పురుషులు 38 లక్షల 56 వేల 770, మహిళలు 35 లక్షల 46 వేల 847, ఇతరులు 669 మంది పోలింగ్ కేంద్రాలు 9248. గ్రేటర్ లో 150 వార్డులు వున్నాయి. ఈ సారి బ్యాలెట్ పద్ధతిన పోలింగ్ జరిగే అవకాశం ఉంటుందన్నట్లు తెలుస్తుంది. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఫేస్ రికాగ్నసేశన్ తో ఓటర్లను గుర్తింపు ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలుస్తుంది. గ్రేటర్ లో అతి పెద్ద డివిజన్ మైలార్ దేవులపల్లి 79 వేల 290 మంది ఓటర్లు అతి చిన్న డివిజన్ రామచంద్రాపురం 27 వేల 948 మంది ఓటర్లు.



