ఎన్టీఆర్ జిల్లా దిశా మహిళా కమిటీ సభ్యురాలుగా నందిగామ బార్ అసోసియేషన్ సభ్యురాలు సీనియర్ న్యాయవాది కురగంటి ప్రవీణ ని నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు .ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ ఎన్టీఆర్ జిల్లా వారు భారత ప్రభుత్వం పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులు నివారణ నిషేధం మరియు పరిహారం చట్టం 2013 మరియు సెక్షన్ 29 ప్రకారం చట్టం అమలు నియమాలు ఎక్కడ అయితే మహిళా ఉద్యోగులు మహిళా పని వారు పని చేస్తారో సంబంధిత సంస్థలు నడుపు వారితో అనగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు అధికారులకు ప్రభుత్వ రంగ సంస్థల అధికారులకు మరి అన్ని రకాల ప్రైవేట్ సంస్థల సదరు చట్టాన్ని అనుసరించి ప్రతి యజమాని వ్రాతపూర్వక ఆర్డర్ ద్వారా అంతర్గత ఫిర్యాదుల కమిటీని నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీలో నందిగామ బార్ అసోసియేషన్ సభ్యురాలు సీనియర్ న్యాయవాది అయినటువంటి కు ర గంటి ప్రవీణ ను నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ జీవో కాపీని ఎన్టీఆర్ జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు రాంబాబు ప్రవీణాకి అందజేశారు. ఎన్టీఆర్ జిల్లాలోని షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగలకు చెందిన ఎస్సీ ఎస్టీ పిఓఏ యాక్ట్ 1989 అమలకు కృషి చేయాలని మరియు ఎన్టీఆర్ జిల్లాలో గల మహిళలకు అండగా నిలవాలని వారి ఇబ్బందులను తెలుసుకొని వారి అభివృద్ధికి తోడ్పడాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది ప్రవీణ మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలోని మహిళలు అందరికీ అండగా ఉంటానని మహిళలు ఎవరైనా అన్యాయానికి గురైన సమాజంలో ఎవరైనా మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న తనను సంప్రదించాలని, మరియు ఎవరైనా అన్యాయానికి గురైన మహిళలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని మరియు ఉచిత న్యాయ సహాయాన్ని కూడా అందిస్తానని ఆమె తెలియజేసినారు .మరియు తన నియామకానికి కృషిచేసిన అధికారులందరికీ ఆమె తన కృతజ్ఞతలు తెలియజేసినారు.
ఎన్టీఆర్ జిల్లా దిశా మహిళా కమిటీ సభ్యురాలుగా సీనియర్ న్యాయవాది కురగంటి ప్రవీణ