పవన్ కల్యాణ్ ని కలసిన అవకు రాజు

జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ని కన్నడ కథానాయకుడు  శ్రీ సుదీప్ మర్యాదపూర్వకంగా కలిశారు . సోమవారం ఉదయం హైదరాబాద్ లోని శ్రీ పవన్ కల్యాణ్ గారి కార్యాలయానికి సుదీప్ వచ్చారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కి మొక్కలు బహూకరించారు. వారిద్దరి మధ్య సుమారు గంట సేపు సంభాషణ సాగింది. కోవిడ్ అన్ లాక్ నేపథ్యంలో ఇటీవలే సినిమా చిత్రీకరణలు మొదలయ్యాయి… ఈ క్రమంలో తాను నటిస్తున్న చిత్రాల గురించి సుదీప్ వివరించారు. కోవిడ్ ప్రోటోకాల్ నిబంధనలకు అనుగుణంగా షూటింగ్స్ చేయడంపై వారిద్దరూ చర్చించుకున్నట్లు సమాచారం. వర్తమాన, సామాజిక అంశాలపై ఆలోచనలను పంచుకున్నారు. సుదీప్ మెగాస్టార్ 151 సినిమా ” సైరా ” లో అవకు రాజు గా కూడా నటించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here