సనాతనధర్మ పునీతుడైన ‘పవన్ కళ్యాణ్’

– తిరుమల పవిత్ర లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై..
– పవన్ చేపట్టిన 11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్షతో దేశవ్యాప్తంగా చర్చ
– అసలు సనాతన ధర్మం అంటే అర్ధమేంటో తెలుసుకోవడానికి నెటిజన్లు సర్వత్రా ఆసక్తి
– సనాతన అంటే శాశ్వతమైన, ధర్మం అంటే నియమం అని అర్ధం చెప్పిన పవన్ కళ్యాణ్
– గత పాలకుల తీరుపై.. లడ్డు కల్తీ పై సీబీఐ ఎంక్వైరీకి డిమాండ్
————–
అమరావతి:
అమృతతుల్యంగా… పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ వ్యవహారం పై జనసేన అధినేత, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ చేపట్టిన స్టాండ్ ను ప్రతీ ఒక్కరూ హర్షిస్తున్నారు. గత పాలకుల వికృత పోకడల ఫలితంగా తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదం అపవిత్రమైంది. జంతు అవశేషాలతో మాలిన్యమైంది. విశృంఖల మనస్కులే ఇటువంటి పాపానికి ఒడిగట్టగలరు. ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోవడం హైందవ జాతికే కళంకం.
లడ్డు ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసిన క్షణం తన మనసు వికలమైందని పవన్ కళ్యాణ్ ఇప్పటికే చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన ఆదివారం నుంచి నంబూరు శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో చేపట్టిన 11రోజుల ప్రాయాశ్చిత్త దీక్ష దేశవ్యాప్తంగా సంచలనమైంది. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని, దేశవ్యాప్త హిందూ ధర్మపరిరక్షణకు ఆయన పూనుకున్నారని అన్నివైపుల నుంచి మద్దతు పెరుగుతుంది.

‘పవన్’ దీక్షకు గత పాలకులతీరే కారణం:
వైకుంఠ ధామంగా భావించే తిరుమల పవిత్రతకు, వేదాచారాలకు, ధార్మిక విధులకు కళంకం తెచ్చే విధంగా పెడపోకడలకు పాల్పడిన గత పాలకుల తీరు హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరినీ బాధించిందని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.

అవసరమైతే సీబీఐ ఎంక్వైరీ జరగాలి:
లడ్డు ప్రసాదం తయారీలో జంతు అవశేషాలు ఉన్న నెయ్యిని వినియోగించారనే విషయం తీవ్ర క్షోభకు గురి చేసింది. ధర్మాన్ని పునరుద్ధరించుకొనే దిశగా అడుగులు వేసే తరుణం ఆసన్నమైందని.. అందులో భాగంగానే ఆయన ప్రాయాచ్చిత్తదీక్ష చేపట్టాల్సి వచ్చిందని వివరించారు. లడ్డులో వినియోగించే నెయ్యిలో జంతు కొవ్వు అవశేషాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించి వేగవంత నిర్ణయాలు తీసుకోవాలన్నారు. అవసరమైతే ఈ వ్యవహారంపై సీబీఐ ఎంక్వైరీకి ఆయన డిమాండ్ చేశారు.

సనాతన ధర్మానికి అర్ధం చెప్పిన పవన్ కళ్యాణ్: భారతదేశంలో నివసిస్తున్న ఎవరైనా కులమతాలకు అతీతంగా సనాతన ధర్మాన్ని ఆచరించాలి. సనాతన ధర్మం అంటే మతం కాదు ప్రాచీన కాలం నుండి అనుసరిస్తున్న ఒక జీవన విధానంగా పవన్ కళ్యాణ్ అర్ధం చెప్పారు. ఆయన ఒక కులానికో, ప్రాంతానికో, మతానికో ప్రతినిధి కాదు. స్వచ్చమైన భారతదేశ ప్రజలకు ప్రతినిధిగా ఇప్పటికే నిరూపించుకున్నారు. మతాలకు అతీతంగా మనుషులంతా ఒక్కటేనని.. ఈశ్వర్, అల్లా, యేసు అయినా ఒక్కరే అని నమ్మే వ్యక్తి పవన్ కళ్యాణ్. అలాగే ప్రతీ మత విశ్వాసాలను అమితంగా విశ్వసించే వ్యక్తి ఆయన. అటు రామాలయానికి రూ.30 లక్షలు విరాళం ఇచ్చి, ఇటు మసీద్ కి రూ. 25లక్షలు విరాళం ఇచ్చి తన లౌకికవాదాన్ని చాటిచెప్పారు. వారి దృష్టిలో
భగవత్గీతైనా, బైబిలైనా, ఖురానైనా ఎంతో పవిత్రమైన గ్రంథాలే.. తన ఇంట్లో ప్రతేటా క్రిస్మస్ వేడుకలు జరుపుకొంటానని పవన్ కళ్యాణ్ ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రస్తావించడం తెలిసిందే, అలాగే ప్రతీరోజు పూజాపునస్కారాలు చేస్తారు. ఎన్నికల్లో తను నామినేషన్ వెయ్యడానికి వెళ్ళేటప్పుడుకూడా పిఠాపురంలో బాప్టిస్ట్ చర్చిలో ప్రాద్ధనలు, భషీర్ బాబా ధర్గాలో దీవెనలు, కుక్కుటేశ్వర స్వామి ఆశీస్సులు అందుకొని సెక్యులరిజానికి సాక్షిగా పవన్ కళ్యాణ్ నిలబడ్డారు.

ఏడుకొండలవాడా..! క్షమించు: పవన్ కళ్యాణ్
తిరుమల ఏడుకొండలవాడా మా గత పాలకుల అపరాధానికి సంబంధించిన వ్యవహారంలో మేము ఇన్నాళ్ళూ గుర్తించనందుకు మమ్మల్ని క్షమించు. ప్రజా క్షేమాన్ని కాంక్షించి పోరాటంలో ఉన్న నాకు ఇటువంటి క్లేశం ఆదిలోనే నా దృష్టికి రాకపోవడం బాధించింది. కలియుగ దైవమైన బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందే. అందులో భాగంగా నేను ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని సంకల్పించాను. ‘దేవదేవా… నీ పట్ల గత పాలకులు చేసిన పాపాలను ప్రక్షాళన చేసే శక్తిని ఇవ్వమ’ని వేడుకుంటున్నాను.

జగన్ కి విశ్వాసం ఉందా..?: పవన్ ప్రశ్న
భగవంతుడిపై విశ్వాసం, పాప భీతి లేనివారే పవిత్ర లడ్డు ప్రసాదంలో జంతు కొవ్వును కలపడం.. ఇటువంటి అకృత్యాలకు ఒడిగడతారు. నా బాధేమిటంటే- తిరుమల తిరుపతి దేవస్థానం అనే వ్యవస్థలో భాగమైన బోర్డు సభ్యులు, ఉద్యోగులు సైతం అక్కడి తప్పిదాలను కనిపెట్టలేకపోవడం, కనిపెట్టినా నోరు మెదపకపోవడం. నాటి రాక్షస పాలకులకు భయపడి మిన్నకుండిపోయారా అనిపిస్తోంది. ఏదేమైనా ధర్మాన్ని పరిరక్షించడం నా ధ్యేయం. ధర్మో రక్షతి రక్షితః

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here