అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్

సీఎం క్యాన్వాయ్ అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివస్తున్న సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

Previous articleచైనా బోర్డ‌ర్‌లో వార్ సైర‌న్‌!
Next articleజ‌నం గుండెల్లో రాజ‌న్న‌!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here