మాదాపూర్ లో నిబంధనలకు విరుద్దంగా నడిపిస్తున్న రిజైన్ స్కై బార్ పబ్ ను ఎక్సైజ్అ ధికారులు సీజ్ చేశారు . కరోనా రూల్స్ కు విరుద్దంగా పెద్ద సంఖ్యలో జనం ఉండటం , ఫిజికల్ డిస్టెన్స్ పాటించకపోవడం, బార్లో పనిచేసే వెయిటర్లు ఎక్కడా మాస్కులు ధరించక పోవటం, పబ్ లో రష్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎక్సైజ్ శాఖ దర్యప్తుకు ఆదేశించింది. ఉదయం పబ్ పై రైడ్ నిర్వహించిన పోలీసులు కస్టమర్లు, సిబ్బందిని ప్రమాదంలోకి నెట్టే విధంగా యాజమాన్యం వ్యవహరించిందని నిర్ధారించి, ఎక్సైజ్ చట్టం సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేసారు.



