గణనాధుడు.. తొలి పూజలు అందుకునే దేవదేవుడు. విఘ్నాలు తొలగించే లంబోధరుడు. ఈ ఏడాది వినాయకచవితి ఉత్సవాలకు ఖైరతాబాద్ వద్ద 27 అడుగుల రూపంతో ఏకాదశి మహారుద్రగణపతి కొలువు దీరనున్నారు. ఈ మేరకు ఈ రోజు కర్రపూజ చేసి వినాయకుడి ప్రతిమకు రూపమిచ్చేందుకు సిద్ధమయ్యారు. కరోనా కారణంగా చాలా కొద్దిమంది సమక్షంలో పూజాదికాలు నిర్వహించారు. 10 తలలతో 27 అడుగుల ఎత్తులో విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. సెప్టెంబరు 10 వ తేదీ లోపుగా విగ్రహాన్ని పూర్తిచేయనున్నారు.