మణుగూరు: సమన్విత సమర్పణలో, య కే ఎస్ ఫిల్మ్ బ్యానర్పై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘మారణహోమం 1990లో’. హార్రర్, థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ తెలంగాణలోని మణుగూరు ప్రాంతంలో లాంఛనంగా ప్రారంభమైంది.
యన్ఎల్ శ్రీకృష్ణ.పి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బందు నరేష్, అనూష హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. పి.వి రెడ్డి, నాగలక్ష్మి.పి, విజయవాడ శ్యామ్ సుందర్, లౌక్య, శిరీష, బందు నాగలక్ష్మి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
30 రోజుల్లో షూటింగ్ పూర్తి: ఈ సందర్భంగా చిత్ర నిర్మాత బందు నాగలక్ష్మి మాట్లాడుతూ.. “మా య కే ఎస్ ఫిల్మ్ బ్యానర్లో వస్తున్న ఈ చిత్రం హార్రర్ మరియు థ్రిల్లర్ జానర్లను ఇష్టపడే ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. ప్రస్తుతం మణుగూరులో షూటింగ్ ప్రారంభించాము. భూపాలపల్లి, భద్రాచలం, మణుగూరు పరిసర ప్రాంతాల్లో ఏకధాటిగా 30 రోజుల పాటు చిత్రీకరణ జరిపి సినిమాను పూర్తి చేస్తాము,” అని తెలిపారు.
1990ల నాటి నేపథ్యంతో, ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో ఈ చిత్రం ఉండబోతోందని చిత్ర యూనిట్ పేర్కొంది.
నటీనటులు: బందు నరేష్, అనూష, పి.వి రెడ్డి, నాగలక్ష్మి.పి, విజయవాడ శ్యామ్ సుందర్, లౌక్య, శిరీష, బందు నాగలక్ష్మి తదితరులు.
సాంకేతిక నిపుణులు:
-
బ్యానర్: య కే ఎస్ ఫిల్మ్ (సమన్విత సమర్పణ)
-
నిర్మాత: బందు నాగలక్ష్మి
-
దర్శకత్వం: యన్ఎల్ శ్రీకృష్ణ.పి
-
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హేమంత్ వేముల
-
డైలాగులు: దాసరి వెంకట్
-
సంగీతం: అర్మాన్
-
కెమెరా మెన్: రాఘవేంద్ర రెడ్డి
-
ఎడిటర్: సునీల్



