జర్నలిస్టులకు అండ

రాష్ట్రంలో ఇప్పటి వరకు  కరోన వైరస్ బారిన పడిన 686 మంది జర్నలిస్టులకు ఒక కోటి 28 లక్షల 60 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించినట్లు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు.

★ వీరిలో  పాజిటివ్ వచ్చిన 600 మంది జర్నలిస్టులకు ఇరవై వేల రూపాయల చొప్పున, ఒక కోటి 20 లక్షల రూపాయలు,  హోం క్వారంటైన్ లో ఉన్న 86 మంది జర్నలిస్టులకు పది వేల రూపాయల చొప్పున 8 లక్షల 60 వేల రూపాయలను అందిచామని తెలిపారు. మొత్తంగా అందరికీ ఒక కోటి 28 లక్షల 60 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు.

  ★ శుక్రవారం నాటికి వివిధ జిల్లాలకు చెందిన జర్నలిస్టులకు కరోనా వైద్య పరీక్షలు నిర్వహించగా 73 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్యాధికారులు నిర్థారించారు. ఈ 73 మంది జర్నలిస్టులకు 14 లక్షల 60 వేల రూపాయలు ఆర్థిక సహాయం జర్నలిస్టుల ఆన్లైన్ ఎకౌంట్లో జమ చేసినట్లు తెలిపారు.

★ జర్నలిస్ట్ మిత్రులు తమ వివరాలను తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్ వాట్సప్ (8096677444) నెంబర్ కి పంపాలని తెలిపారు.  మరిన్ని వివరాలకు  మీడియా అకాడమీ మేనేజర్ లక్ష్మణ్ కుమార్  సెల్ నెంబర్  9676647807 ని సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.

 ★ కరోనా బారిన పడిన పాజిటివ్, క్వారంటైన్ జర్నలిస్టులు ప్రభుత్వ డాక్టర్లు ధృవీకరించిన మెడికల్ రిపోర్టులు మీడియా అకాడమీ కార్యాలయానికి తప్పనిసరిగా పంపించాలని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here