అడ్డంగా దొరికిన పోలీస్ ఇన్‌స్పెక్ట‌ర్‌!

భూవివాదాలు పోలీసుల‌కు కాసుల వ‌ర్షం కురిపిస్తున్నాయి. రైతుల నిస్స‌హాయ‌త‌.. క్రిమిన‌ల్స్ దౌర్జ‌న్యంతో అవి ఠాణాల వ‌ర‌కూ చేరుతున్నాయి. అక్క‌డ పైస‌లు చేతిలో ప‌డ‌నిదే న్యాయం జ‌ర‌గ‌దు అనేంత‌గా కొంద‌రు పోలీసులు వ్య‌వ‌హ‌రిస్తుంటారు. ఇలా రంగారెడ్డి జిల్లా షాబాద్ ప‌రిధిలో ఓ పెద్దాయ‌న‌కు క‌డుపు మండింది. అంతే.. ఏసీబీ అధికారుల‌కు ఉప్పందించాడు. అవినీతికి కేరాఫ్ చిరునామాగా మారుతున్న వారిని క‌ట్ట‌డి చేసేందుకు త‌న‌వంతు స‌హ‌కారం అందించాడు. షాబాద్ పోలీస్‌స్టేస‌న్ ఇన్‌స్పెక్ట‌ర్ శంక‌ర‌య్య, ఏఎస్సై రాజేంద‌ర్ ఇద్ద‌రూ ఓ బాధితుడి నుంచి రూ.20వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల‌కు రెడ్‌హ్యాండెడ్‌గా రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌డ్డారు. ప్ర‌స్తుతం ఏసీబీ అధికారులు ఆ ఠాణాలో సోదాలు చేప‌ట్టారు. అవ‌కాశాన్ని బ‌ట్టి ఇన్‌స్పెక్ట‌ర్ ఆస్తుల గురించి కూడా కూపీ లాగేందుకు అవ‌కాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here