శాల్యూట్‌… సీపీ స‌జ్జ‌నార్ సార్‌!

క‌ష్టం వ‌చ్చిన ప్ర‌తిసారీ దైవం వ‌స్తాడో రాడో కానీ.. పోలీసులు మాత్రం వ‌స్తారు. ప్ర‌కృతి విప‌త్తులు.. వైర‌స్‌లు విస్త‌రించి జ‌నాన్ని భ‌య‌పెడుతున్న‌పుడు మేమున్నామంటూ దైర్యం చెప్పేందుకు ఖాకీ డ్రెస్ ముందు వ‌రుస‌లో ఉంటుంది. వారం రోజులుగా హైద‌రాబాద్‌పై ప‌గ‌బ‌ట్టిన వ‌ర‌ణుడు జ‌నాన్ని వ‌ణికిస్తున్నాడు . ఇటువంటి కీల‌క‌మైన స‌మ‌యంలో సైబ‌రాబాద్ పోలీసు క‌మిష‌న‌ర్ వి.సి.స‌జ్జ‌నార్ అన్నీతానై సిబ్బందిని వెంటేసుకుని ఊరూవాడా ప‌ర్య‌టిస్తున్నారు. ఐదోరోజు ఆదివారం కూడా పల్లె చెరువు, అప్ప చెరువు, గగన్ పహాడ్, పలు కాలనీల్లో అధికారులతో కలిసి పరిస్థితిని సమీక్షించారు.

రాజేంద్రనగర్ డివిజన్ లోని పల్లె చెరువు, అప్ప చెరువు, గగన్ పహాడ్ చెరువు తదితర ప్రాంతాల పరిస్థితిని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్, ఐపీఎస్., శంషాబాద్ డిసిపి ప్రకాష్ రెడ్డి, ఐపీఎస్., సైబరాబాద్ డిసిపి ట్రాఫిక్ ఎస్ ఎమ్ విజయ్ కుమార్, ఐపీఎస్., రాజేంద్రనగర్ ఏసీపీ అశోక్ చక్రవర్తి, చేవెళ్ల ఏసీపీ రవీందర్ రెడ్డి తదితర అధికారులు, ఎస్ఓటీ బృందంతో కలిసి వరుసగా 5వ రోజూ స్వయంగా పర్యటించి సమీక్షించారు. అలీ నగర్ , సుబాన్ కాలనీ, కింగ్స్ కాలనీలల్లోని ని ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. తక్షిణ సహాయక చర్యలుగా వారికి అవసరమైన సాయం అందించారు.

ఈ సంద‌ర్భంగా సీపీ స‌జ్జ‌నార్ అక్క‌డి ప్ర‌జ‌ల‌కు భ‌రోసానిచ్చారు. శ‌నివారం రాత్రి కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరింది. అలీ నగర్ , సుబాన్ కాలనీ, కింగ్స్ కాలనీలల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేశామన్నారు. ఇబ్బంది ఉన్నవారిని షెల్టర్ హుమ్స్ /సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. ఆహారం, ఇతర నిత్యావసర వస్తువులను అందస్తున్నామన్నారు.
ఇటీవ‌లి భారీ వర్షాలకు పల్లె చెరువు కట్ట కు రెండు చోట్ల రంధ్రాలు పడగా వెంటనే పూడ్చి వేశామన్నారు. అప్ప చెరువు కట్ట మరమ్మతు పనులు కొనసాగుతున్నాయన్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఓల్డ్ కర్నూల్ రోడ్డు బ్రిడ్జ్ వద్ద.. బెంగళూరు జాతీయ రహదారి పైన ఒకవైపు మూసివేయడం జరిగిందన్నారు. ప్రజలు, వాహనదారులు ప్రత్యామ్నాయంగా మరోవైపు నుంచి వెళ్లాలని సూచించారు.

– రోడ్లపై నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటే.. వాహనదారులు అందులో నుంచి వాహనాన్ని నడిపే సాహసం చేయవద్దన్నారు. పోలీసులు సూచించే ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణం చేయాలన్నారు.
– లోతట్టు ప్రాంత ప్రజలను వీలైనంత త్వ‌ర‌గా ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు వెళ్లాలంటూ ఎప్పటికప్పుడు పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ మైక్ ల ద్వారా పోలీసులు అనౌన్స్ మెంట్ చేస్తున్నామన్నారు.
– ఇప్పటికే అలీ నగర్ , సుబాన్ కాలనీ, కింగ్స్ కాలనీ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు త‌ర‌లించామన్నారు.

– వాతావరణ శాఖ సూచనలను అనుసరించి ప్రజలంతా రానున్న రెండు, మూడు రోజుల వరకూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అవసరమైతే తప్ప ప్రజలు ఇంటి నుంచి అనవసరంగా బయటకు రావద్దన్నారు.
– అధికారులంతా 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్ని సహాయక చర్యలు చేపడుతున్నామన్నారు.
– ప్రకృతి సృష్టించిన విలయంలో అధికారులు, ప్రజలంతా కలిసికట్టుగా ప‌నిచేయాల‌ని సూచించారు. ఆప‌ద వేళ 100కు డ‌య‌ల్ చేయాల‌ని కోరారు.

Previous articleటాలీవుడ్‌లో చెర‌గ‌ని మెగా హ‌వా!
Next articleమాజీ హోమంత్రిని ప‌రామ‌ర్శించిన త‌ల‌సాని

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here